బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు..
బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు.. బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు.. ప్రేక్షితం భక్షయేన్మాంసం బ్రాహ్మాణానాం చ కామ్యయా ! ( మనుధర్మ శాస్త్రం , ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం.) - బ్రాహ్మణులు మాంసం తినవలెనని కోరిక కలిగినపుడు తినవచ్చు. యఙాయ జగ్ధిర్మాంసస్యేత్యేష దైవో విధి:స్మృత: ! ( ముప్పై ఒకటవ శ్లోకం) - యఙం కొరకు పశువులను వధించడం , మాంసభక్షణ చేయడం దైవోచిత కార్యము. నియుక్తస్తు యథాన్యయాయంయో మాంసం నాత్తి మానవ: ! స ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవింశతిమ్ !! ( ముప్పై ఐదవ శ్లోకం) - శ్రాద్ధాది కర్మలందు తమ పితరులకు విధిపూర్వకంగా మాంసం అర్పణం చేసి తను మాంసాన్ని భుజించని యెడల ముప్పై ఒక్క జన్మలు పశు యోని యందు జన్మించును. పై శ్లోకాలను నిశితంగా పరిశీలిస్తే మాంసము ఆహారములో భాగంగా తీసుకోవలసిందిగా చెప్పబడుతోంది. శ్రాద్ధ కర్మలందు పితరులకు , దేవతలకు మాంసం అర్పించవలెనని శాస్త్రాన్ని బట్టి తెలుస్తోంది. మాంసాహారులని ఎందుకు శూద్రులను వేరు చేసి చూస్తారో ! శాస్త్రం రాసిందెవరు..ఆ రాసినవారు తమకు అనుకూలంగా ఎన్ని లొసుగులతో రాసుకున్నారో అర్థమవుతుంది. శూద్రులు చదువుకుంటే ఙానవంతులై ఇవన్నీ ప